

రాఖీ పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ 5,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఆగస్టు 27 నుంచి ఆగస్టు 31 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రవాణా, రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పండగ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి చర్చించారు.
గతేడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా 4,760 ప్రత్యేక బస్సులను నడిపామని, ఈసారి అదనంగా 240 బస్సులను పెంచి మొత్తం 5,000 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గతేడాది ఈ ప్రత్యేక బస్సుల ద్వారా సుమారు 3.68 కోట్ల మంది ప్రయాణించగా, వారిలో 2.51 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. ఈసారి పెరిగే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ చర్యలు చేపడుతోందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!