

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహణకు సంబంధించిన సన్నాహకాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సీఈఓలు, సీఏక్స్ఓలు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. ఈ-మెయిల్ ద్వారా అధికారిక ఆహ్వానాలు పంపే ప్రక్రియను వెంటనే ప్రారంభించి, సంబంధిత శాఖలు సమన్వయంతో ఆహ్వానితుల జాబితాను సిద్ధం చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి విస్తృతంగా పరిచయం చేసి, తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మరింతగా నిలబెట్టాలని సీఎస్ పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ, ఐటీ, ఏఐ, ఫార్మాస్యూటికల్స్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, అధునాతన తయారీ, మౌలిక వసతులు, ఆవిష్కరణలు తదితర రంగాల్లోని అవకాశాలను సమర్థవంతంగా ప్రదర్శించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో సమయపాలనతో కూడిన కార్యాచరణను అమలు చేయాలని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!