
రాజకీయాలు

స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన కొత్త చిత్రానికి ‘ఇంజివెల్లం’ అనే టైటిల్ను ప్రకటించారు. తెలుగులో ఈ పేరుకు ‘బెల్లం అల్లం’ అని అర్థం. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. విడుదలైన ప్రచార చిత్రం ఆధారంగా చూస్తే కథ కోల్కతా నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
కథాబలమున్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, సాయి పల్లవి తొలిసారి మణిరత్నం దర్శకత్వంలో కలిసి నటిస్తుండటం ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!