
బిజినెస్

హైదరాబాద్లోని అబిడ్స్ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా ఓ అనుమానిత నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై కారును దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలు విరగగా, ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
హుస్సేనీ ఆలంకు చెందిన సైఫ్గా గుర్తించిన నిందితుడిని పోలీసులు అనంతరం అఫ్జల్గంజ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అబిడ్స్, అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!