
సినిమాలు

జమ్మూలోని ప్రసిద్ధ మాతా వైష్ణోదేవీ ఆలయంలో భక్తులు సమర్పించిన వెండి కానుకలపై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయానికి భక్తులు సమర్పించిన సుమారు 20 టన్నుల వెండిలో కేవలం 50 శాతం మాత్రమే అసలైన వెండిగా తేలినట్లు సమాచారం. మిగిలిన భాగంలో నాణ్యత లేని లోహాల మిశ్రమం ఉన్నట్లు గుర్తించారు.
పరిశీలనలో నకిలీ వెండి కానుకల్లో కాడ్మియం, ఇనుము వంటి లోహాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో ఆలయ అధికారులు దీనిపై మరింత విచారణ చేపట్టినట్లు సమాచారం. కానుకల నాణ్యతను పర్యవేక్షించేందుకు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!