

తిరుపతి/దేవుని కడప, ఆగస్టు 24: దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు సోమవారం భక్తిశ్రద్ధలతో, ఆగమ శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మనోన్మాన ప్రమాణ శాంతి హోమం, కుంభస్థాపన, పంచాగ్ని ప్రణయనం, శాత్తుమొర తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఆగస్టు 25న చతుస్థానార్చన, ఏకశీతి కలశ స్నపనం, మూర్తి హోమం, అష్టబంధనం, శయ్యాధివాసం, తత్వ హోమాలు, శాంతి హోమం నిర్వహించనున్నారు. ఆగస్టు 26న ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!