25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

Writer: Nithish 06:19 AM, 25 ఆగస్టు, 2026
భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

భారత్‌, అమెరికా మధ్య వ్యూహాత్మక రక్షణ, పారిశ్రామిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (టీఎల్‌ఎంఏఎల్‌) ప్లాంట్‌ను ఆయన సందర్శించారు. భారత వైమానిక దళం కోసం సుమారు 80 మధ్య శ్రేణి రవాణా విమానాల కొనుగోలుకు టెండర్‌ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానాల కీలక భాగాలను హైదరాబాద్‌లో భారతీయ ఇంజినీర్లు, సిబ్బంది తయారు చేస్తున్న తీరును గోర్‌ పరిశీలించారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, సురక్షితమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతం కోసం భారత్‌-అమెరికా భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంయుక్త భాగస్వామ్యంతో 2010లో ఏర్పాటైన సంస్థ సీ-130జే విమానాలకు కీలక నిర్మాణ భాగాలను సరఫరా చేస్తోంది. భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 12 సీ-130జే విమానాలు ఉన్నాయి. పాత రవాణా విమానాల స్థానంలో సుమారు 80 కొత్త మధ్య శ్రేణి రవాణా విమానాల కొనుగోలుకు లాక్‌హీడ్‌ మార్టిన్‌ సీ-130జేతో పాటు ఎంబ్రాయెర్‌ సి-390 మిలీనియం, ఎయిర్‌బస్‌ ఏ-400ఎమ్‌ పోటీలో ఉన్నాయి. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో విమానాల మరమ్మతు, నిర్వహణ సేవల (ఎంఆర్‌ఓ) కేంద్రాన్ని డిసెంబరులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సీఈఓ, ఎండీ సుకరన్‌ సింగ్‌ తెలిపారు. 2027 ఏప్రిల్‌ నాటికి తొలి విమానం సర్వీసింగ్‌ కోసం కేంద్రానికి రానుందని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

ట్యాగ్లు
భారత్ అమెరికా రక్షణ భాగస్వామ్యంసెర్గియో గోర్లాక్‌హీడ్ మార్టిన్టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్సీ-130జే సూపర్ హెర్క్యులస్భారత వైమానిక దళంహైదరాబాద్ ఏరోస్పేస్రక్షణ రంగంఎంఆర్‌ఓ కేంద్రంఇండో పసిఫిక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌
జనరల్

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం
జనరల్

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు
జనరల్

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌
బిజినెస్

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌
బిజినెస్

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

ట్రంప్‌తో మీడియా భేటీ వద్దని భారత్‌ ఎందుకు కోరింది? అసలు కారణం ఇదే!
జనరల్

ట్రంప్‌తో మీడియా భేటీ వద్దని భారత్‌ ఎందుకు కోరింది? అసలు కారణం ఇదే!

తిరుమలలో వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు
జనరల్

తిరుమలలో వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రంపై రేవంత్‌ ఫైర్‌.
జనరల్

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రంపై రేవంత్‌ ఫైర్‌.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష
రాజకీయాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

ఓటర్ల జాబితా సవరణలో కీలక అడుగు.
జనరల్

ఓటర్ల జాబితా సవరణలో కీలక అడుగు.

సినిమా నుంచి ఆ సన్నివేశాలు తొలగించాలి.. ‘ఇరుముడి’పై ఏపీ టీచర్ల డిమాండ్
సినిమాలు

సినిమా నుంచి ఆ సన్నివేశాలు తొలగించాలి.. ‘ఇరుముడి’పై ఏపీ టీచర్ల డిమాండ్