

బీపీసీఎల్ సరఫరా చేసిన సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) మిశ్రమ ఇంధనంతో అకాసా ఎయిర్ తన తొలి వాణిజ్య విమానాన్ని విజయవంతంగా నడిపింది. సెప్టెంబర్ 8న ముంబయి–గోవా మధ్య నడిచిన ఈ విమానంలో సంప్రదాయ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)తో 1 శాతం SAFను మిళితం చేశారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:05 గంటలకు బయలుదేరిన విమానం.. 2:30 గంటలకు గోవా చేరుకుంది. శుద్ధమైన, తక్కువ కార్బన్ ఉద్గారాల విమాన ఇంధన వినియోగంలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
అకాసా ఎయిర్, బీపీసీఎల్ సంస్థలు జూలై 2026లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. SAF మిశ్రమ ఇంధనంతో విమానాన్ని నడపడం ద్వారా భవిష్యత్తులో ఈ ఇంధనాన్ని భారీ స్థాయిలో వినియోగించేందుకు అవసరమైన ఆచరణాత్మక అనుభవం రెండు సంస్థలకు లభించనుంది. విమానయాన రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించే దిశగా భారత్ చేపడుతున్న చర్యల్లో ఇది మరో ముందడుగు. 2030 నాటికి విమాన ఇంధనంలో 5 శాతం SAF మిశ్రమాన్ని సాధించాలనే లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!