
ఆరోగ్యం

175 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI)కు ఓ మహిళ అత్యున్నత బాధ్యతలు చేపట్టారు. GSI తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా వర్షా అశోక్ అగ్లావే చరిత్ర సృష్టించారు. సంస్థ 54వ డీజీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.
జియోసైన్స్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వర్షా అగ్లావే పాలియోంటాలజీ, శిలాజాల పరిశోధన, భౌగోళిక అన్వేషణ వంటి విభాగాల్లో పనిచేశారు. ఖనిజ అన్వేషణ, ప్రకృతి విపత్తులపై పరిశోధనతో పాటు భారతదేశ కీలక ఖనిజ భద్రతను బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఆమె నియామకం భారతీయ శాస్త్రరంగంలో మహిళలకు మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!