
ఓటీటీ

హైదరాబాద్లోని యూసుఫ్గూడ సర్వే నంబర్ 45లో ఉన్న రెండు ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించిన కేసులో కౌంటర్లు దాఖలు చేయడంలో ఆలస్యం జరిగిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, జరిమానా మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్కు జమ చేయాలని ఆదేశించింది.
కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు భూమి వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. గతంలో తుది అవకాశం ఇచ్చినప్పటికీ కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరుకాలేదని ధర్మాసనం పేర్కొంది. అలాగే హైడ్రా తరఫున దాఖలైన కౌంటర్ పిటిషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైనట్లు వెల్లడైంది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 15కు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం వాయిదా వేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!