
రాజకీయాలు

మహిళా ఉద్యోగుల కార్యాలయ భద్రత, లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శక్తి (కార్మిక) శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోష్ చట్టం–2013) అమలులో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీకి డిప్యూటీ సెక్రటరీ ఎం.జి. మాధవిని ప్రెసైడింగ్ ఆఫీసర్గా నియమించారు. మహిళా ఉద్యోగుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!