
జనరల్

ఉత్తర కొరియా ప్రజలు మరింత వినోదాన్ని ఆస్వాదించేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ కొత్త ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రజల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే వినోద కార్యక్రమాలను, విదేశీ కార్యక్రమాలను పెంచడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రజలకు వినోదాన్ని అందించే కార్యక్రమాల సంఖ్యను పెంచాలని కిమ్ సూచించినట్లు సమాచారం.
అయితే ఈ వినోద కార్యక్రమాలు కూడా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి, అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల పరిధిలోనే ఉండాలని కిమ్ స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రజల కోసం నిర్వహించే వినోద కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!