
జనరల్

జపాన్ ప్రధాని తకాయిచి భారత్ పర్యటన రెండో రోజున ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అనంతరం ఆమె త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
భారత్-జపాన్ మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మోదీ, తకాయిచి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొననుండగా, మధ్యాహ్నం 3 గంటలకు భారత్-జపాన్ బిజినెస్ ఫోరం సమావేశం జరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!