

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇస్రో ఉద్యోగులు తొలిసారిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పేస్ ప్రమోషన్ విభాగం చైర్మన్ పవన్ గోయెంకా ఇకపై ఇస్రో ప్రయోగ వాహక నౌకలను రూపొందించబోదని వ్యాఖ్యానించినట్లు వార్తలు రావడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లోని వేలాది మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొమ్మిది ఉద్యోగ సంఘాలు స్పష్టత కోరాయి.
ప్రైవేటు భాగస్వామ్యానికి తాము వ్యతిరేకం కాదని, అయితే అది నిర్దిష్ట వాణిజ్య కార్యకలాపాలకే పరిమితం కావాలని ఉద్యోగ సంఘాలు సూచించాయి. ప్రయోగ వాహక నౌకల అభివృద్ధిని నిలిపివేస్తే ఇస్రో కేవలం పరిశోధన, అభివృద్ధి సంస్థగా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో అంతరిక్ష కార్యకలాపాలు ఇస్రో పరిధిలోనే కొనసాగుతాయా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!