
సినిమాలు

హోర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమైన ఈ జలమార్గంలో ఉన్న మందుపాతరలను పూర్తిగా తొలగించామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ మళ్లీ కొత్తగా మైన్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సముద్ర రవాణాకు ఆటంకం కలిగించే ఎలాంటి చర్యలనైనా అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు.
మైన్లు ఏర్పాటు చేసే నౌకలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిలో కొత్తగా మైన్లు ఏర్పాటు చేయడంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన, వాణిజ్య రవాణాకు కీలకమైన ఈ జలమార్గం చుట్టూ ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!