

విశాఖపట్నం సమీపంలోని గురులోవలో ఉన్న ‘విజ్ఞాన్ విహార్’ పాఠశాలలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే భారతమాత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సమావేశాలను ప్రారంభించారు. ఆగస్టు 21 సాయంత్రం వరకు జరిగే ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ ముఖ్య బాధ్యులతో పాటు వివిధ సంస్థల జాతీయ స్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు.
ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో పనిచేస్తున్న వివిధ రంగాలకు చెందిన 32 సంస్థల జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంస్థాగత బాధ్యులు, ఎంపిక చేసిన కార్యకర్తలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. మొత్తం 327 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. వివిధ సంస్థల కార్యకలాపాలు, సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, ఆయా రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై మూడు రోజుల పాటు సమన్వయ చర్చలు జరగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!