

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయడం వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతున్నాయని ఆరోపిస్తూ ఎయిర్పోర్టు కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్ సీహెచ్. ప్రసాద్కు కార్మికులు ఫిర్యాదు చేశారు. అనంతరం మహిళా కార్మికులు బి. జ్యోతి, కే. చిన్నారి, పి. రాధ మీడియాతో మాట్లాడుతూ తమకు న్యాయం చేయకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ఓటు వేసిన తర్వాత తమ జీవితాలు రోడ్డున పడ్డాయని మహిళా కార్మికులు ఆరోపించారు. విశాఖకు వచ్చిన నారా లోకేష్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా, ఆ హామీ అమలు కాలేదని అన్నారు. విశాఖ ఎంపీ భరత్ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు తమకు అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు సైతం తమ సమస్యను పట్టించుకోవడం లేదని, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పరిస్థితిపై స్పందించాలని కార్మికులు కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!