
క్రీడలు

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయానికి ఆమె తన బ్యాంక్ స్టేట్మెంట్ను తీసుకెళ్లినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేశారన్న ఆరోపణలపై అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల ద్వారా హవాలా మార్గంలో డబ్బులు పొందారని, ఆ మొత్తాలను లెక్కల్లో చూపలేదని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తున్నట్లు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే పలువురు టాలీవుడ్ నటులను ఈడీ విచారించింది. మొత్తం 14 ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సెలబ్రిటీలు చేసిన ప్రమోషన్లపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయా ప్రచారాల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, చెల్లింపుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్ విచారణలో వెల్లడైన అంశాలపై అధికారికంగా మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!