

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రుణదాతలు దాఖలు చేసిన సుమారు రూ.22,006.57 కోట్ల క్లెయిమ్స్కు బదులుగా కేవలం రూ.6.5 కోట్లు చెల్లించే ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. దీంతో రుణదాతలకు లభించే రికవరీ దాదాపు 0.03 శాతానికే పరిమితం కాగా, దాదాపు 99.97 శాతం ‘హెయిర్కట్’ పడనుంది. ఈ కేసు ఎస్సెల్ గ్రూప్ సంస్థలకు ఇచ్చిన రుణాలకు సుభాష్ చంద్ర వ్యక్తిగత హామీదారుగా ఉన్న నేపథ్యంలో దాఖలైంది.
ఎన్సీఎల్టీ సభ్యుడు నీలేశ్ శర్మ మూడో సభ్యుడిగా వ్యవహరిస్తూ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నేతృత్వంలోని కొందరు రుణదాతలు ఈ చెల్లింపు ప్రతిపాదనను ‘అమలు సాధ్యం కానిది, చట్టవిరుద్ధమైనది’ అంటూ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ట్రిబ్యునల్ వాటిని తిరస్కరించింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్కు ఉన్న రూ.1,322.39 కోట్ల క్లెయిమ్కు ప్రతిపాదించిన చెల్లింపు కేవలం రూ.38.09 లక్షలు మాత్రమే, అంటే దాదాపు 0.028 శాతం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!