

శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ సాగర్ ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 14న వినాయకచవితి పండుగలోపు నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటి విడుదల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నీటి విడుదలపై స్పష్టత ఇవ్వకపోతే కోదాడ నుంచి హాలియా వరకు, లేదంటే హాలియా నుంచి కోదాడ వరకు వేలాది మంది రైతులతో కలిసి పాదయాత్ర చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు. కృష్ణా జలాలను సీఎం రేవంత్రెడ్డి తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సాగర్ నీటి అంశాన్ని లేవనెత్తుతామని తెలిపారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఎడమకాల్వకు నీరివ్వకుండా కుడికాల్వకు నీరు విడుదల చేసిన సందర్భం లేదన్నారు. సాగర్ ఆయకట్టుకు నీరు అందక వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!