

కుంభమేళాలో రుద్రాక్షలు విక్రయిస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన మోనాలిసా భోంస్లే మరో కొత్త అడుగు వేశారు. తాజాగా మోనాలిసా ఐకాన్ అఫీషియల్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఛానెల్ను ప్రమోట్ చేస్తూ అభిమానులు సబ్స్క్రైబ్ చేసి మద్దతు ఇవ్వాలని కోరారు.
తన యూట్యూబ్ ఛానెల్లో మ్యూజిక్ వీడియోలు, షూటింగ్కు సంబంధించిన సన్నివేశాలు, వ్లాగ్స్ను అందించనున్నట్లు మోనాలిసా వెల్లడించారు. డిజిటల్ కంటెంట్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునే ఉద్దేశంతోనే ఆమె ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఛానెల్కు వందలాది మంది సబ్స్క్రైబర్లు, వేలాది వ్యూస్ నమోదైనట్లు సమాచారం.
మరోవైపు మోనాలిసా వ్యక్తిగత జీవితం కూడా కొంతకాలంగా వివాదాలకు కేంద్రంగా మారింది. ఈ ఏడాది మార్చిలో ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకున్న తర్వాత వివాహం, వయసుకు సంబంధించిన పలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఆమె వయసుకు సంబంధించిన అంశంపై చట్టపరమైన వివాదం కూడా కొనసాగుతోంది. తన అధికారిక పుట్టిన తేదీ నమోదు తప్పుగా ఉందని పేర్కొంటూ మోనాలిసా కోర్టును ఆశ్రయించారు. అలాగే తనను గుర్తుతెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని, ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసు రక్షణకు సంబంధించిన ఆదేశాలు కూడా వెలువడ్డాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!