
జనరల్

ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు అధ్యక్షతన ఈ రోజు సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జూలై 15 నుంచి కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుంచి మాత్రమే చందా మినహాయిస్తారు. గతంలో అదనంగా మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. వారం రోజుల్లో ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, తదుపరి సమావేశంలో ప్యాకేజీ రేట్లు మరియు ఆసుపత్రుల జాబితాను ఖరారు చేయనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!