
జనరల్

నిజమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు, అన్యాయం కలగకుండా చూడాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషనర్కు లేఖ రాసింది. ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియలో మ్యాపింగ్, మ్యాచ్ కాని రికార్డుల పేరుతో జారీ చేస్తున్న నోటీసులపై స్పష్టత ఇవ్వాలని పార్టీ కోరింది. ఈ అంశంపై ఎన్నికల అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
చదువు, ఉద్యోగాల కోసం చాలామంది నిజమైన ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని వైఎస్సార్సీపీ పేర్కొంది. అలాంటి ఓటర్ల ధ్రువీకరణ విషయంలో ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని కోరింది. బూత్ లెవల్ అధికారులను (BLOs) ప్రక్రియలో భాగస్వాములను చేసి, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!