

సాధారణంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. ఏప్రిల్, మే నెలల్లో మయన్మార్, బంగ్లాదేశ్, ఉత్తర బెంగాల్ వైపు, జూన్, జూలైలో బెంగాల్, ఉత్తర ఒడిశా వైపు, జూలై, ఆగస్టులో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర వైపు వీటి ప్రభావం కనిపిస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్లో దక్షిణాంధ్ర, నవంబర్, డిసెంబర్లో తమిళనాడు, ప్రకాశం, నెల్లూరు తీరాల వైపు వాయుగుండాలు, తుపాన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఏర్పడిన అల్పపీడనాలన్నీ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలకు సమీపంలోని వాయవ్య బంగాళాఖాతంలోనే ఏర్పడుతున్నాయి. తీరానికి దగ్గరగా ఏర్పడే అల్పపీడనాలు బలపడే అవకాశం తక్కువగా ఉండటంతో ఇప్పటివరకు ఒక్క అల్పపీడనం కూడా తుపానుగా మారలేదు. ఈ పరిస్థితికి ఎల్నినో ప్రభావం కూడా ఒక కారణమై ఉండొచ్చని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై అయినా ఏపీ తీరానికి సమీపంలో అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు కురిపిస్తాయా అనేది వేచి చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!