
బిజినెస్

బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అదనపు డీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు వెంటనే భద్రత కల్పించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలంగాణ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేదా నోటీసులు ఇవ్వకుండా ఆయన భద్రతను తొలగించడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు.
నాలుగు రోజుల క్రితం భద్రతను తొలగించి, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంద కృష్ణ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేత, మాజీ పోలీసు అధికారికి భద్రత తొలగించడం అన్యాయమని, వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!