
ఓటీటీ

హైదరాబాద్లో అర్ధరాత్రి సమయంలో సహాయం కోరిన ఓ యువతికి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ నుంచి వచ్చిన రైలు ఆలస్యం కావడంతో ఆమె రాత్రి 1.45 గంటల సమయంలో లింగంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఒంటరిగా ఉండటంతో భయపడి రక్షణ కోసం పోలీసులను సంప్రదించినట్లు ఆమె తెలిపింది.
అయితే సహాయం చేయాల్సిన సమయంలో పోలీసులు బాధ్యతారాహిత్యంగా స్పందించారని యువతి ఆరోపించింది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల్లో వీడియో రూపంలో పంచుకోవడంతో అది విస్తృతంగా వైరల్ అయింది. మహిళల భద్రత అంశంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఆరోపణల నిజానిజాలను అధికారులు పరిశీలిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!