
గాసిప్స్

దివంగత సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ ఆమె నివాసంలో పరామర్శించి సానుభూతి తెలిపారు. తన తండ్రికి కడసారి నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో వైసీపీ నేతలు అడ్డుకున్నారని క్రాంతి ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరామర్శ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా జనసేన నాయకులు కూడా క్రాంతిని కలిసి ధైర్యం చెప్పారు. గత ఎన్నికల సమయంలో తండ్రితో రాజకీయంగా విభేదించి జనసేనలో చేరిన క్రాంతి, ప్రస్తుతం ఎదురైన పరిణామాలపై భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!