
సినిమాలు

వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఆందోళన చెందుతున్న నిర్మల్ జిల్లా బాసర మండలం ఓని గ్రామ రైతులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆశ్రయించారు. మంచి వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండాలని అన్నదాతలు వెంకన్నను వేడుకున్నారు.
తగినంత వర్షపాతం లేకపోవడంతో పంటల భవిష్యత్తుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం కాపాడాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. రైతుల ఈ భక్తి, విశ్వాసం పలువురిని ఆకట్టుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!