
సినిమాలు

ఫిషింగ్ హార్బర్ సమీపంలో గురువారం ఉదయం జరిగిన బోటు ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉద్ధృతి కారణంగా అదుపుతప్పి బోల్తాపడింది. బలమైన అలల తాకిడితో బోటుతో పాటు మత్స్యకారులు పెద్ద పెద్ద రాళ్ల మధ్య ఇరుక్కుపోయినా, బోటును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు.
ఈ ప్రమాదంలో తాతారావు, ఆకాష్ తీవ్రంగా గాయపడగా, వారిని విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో రూ.2.5 లక్షల విలువైన బోటు, రూ.2 లక్షల విలువైన చేపల వల పూర్తిగా దెబ్బతిన్నాయి. గంగమ్మ తల్లి కృపతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపిన మత్స్యకారులు, తమకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!