
జనరల్

విజయవాడలో సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. మరింత విచారణ కోసం 12 రోజుల కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని నిందితుల లాయర్లు కోరారు. ఏసీఎం కోర్టు ఈ పిటిషన్పై నేడు ఆదేశాలు జారీ చేయనుంది.
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ కాగా, మరికొందరు పరారీలో ఉన్నారు. విచారణలో నిందితులు నోరు మెదపడం లేదని సమాచారం. మిస్సైన సీసీ ఫుటేజ్పై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!