
సినిమాలు

నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన చోరీల కేసుల్లో నిందితుడిని హైదరాబాద్లో గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టారు. మంగళవారం నల్గొండ సీసీఎస్ పోలీసులు అందిన సమాచారం ఆధారంగా హైదరాబాద్ చేరుకుని ఆదిభట్ల సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
అయితే నిందితుడు పోలీసులకు ఎదురు తిరిగి తప్పించుకునేందుకు యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. గాయపడిన నిందితుడిని ఏపీకి చెందిన భూష్మి శ్రీకాంత్గా గుర్తించి వనస్థలిపురం ఆసుపత్రికి తరలించారు. అతనిపై పదికి పైగా దొంగతనాల కేసులు, నాలుగేళ్ల క్రితం ఏపీలో కానిస్టేబుల్ హత్య కేసు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!