

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఆయన తల్లిపై అవమానకరమైన, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్పై తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు అందింది. వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను భద్రపరచి, వాటిని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు. చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అసెంబ్లీలో విజయ్ చేసిన ‘కుట్టి కథై’ వ్యాఖ్యలను విమర్శించే క్రమంలో నాగేంద్రన్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. విజయ్, ఆయన తల్లిపై చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని పలువురు నేతలు విమర్శించారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని పలువురు సూచించారు. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు, తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!