
జనరల్

ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్ధికి నాట్స్ ఏరోస్పేస్ సంస్థ కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నాగార్జునసాగర్ లేదా కర్నూలు విమానాశ్రయాల్లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాలని సంస్థ ప్రతిపాదించింది. సంస్థ ప్రతినిధి అథిరాజ్ సింగ్ చావ్లా సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి ప్రాజెక్టు వివరాలను సమర్పించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్లలో సుమారు 100 మందికి ఉపాధి కల్పించడంతో పాటు యువతకు ఏవియేషన్ రంగంలో అత్యాధునిక శిక్షణ అందించాలనే లక్ష్యాన్ని సంస్థ వెల్లడించింది. ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరియు విమానయాన రంగ విస్తరణకు ఇది కీలక అడుగుగా నిలిచే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!