

ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తాతా మధు ఉపయోగించిన భాష సరికాదని, బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఈ వ్యవహారంపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాతా మధు కావాలనే అలా మాట్లాడారా? లేక ఎవరైనా మాట్లాడించారా? అని ప్రశ్నించిన ఆయన, తాతా మధును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
22ఏ అంశంపైనా మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై మంత్రి స్వయంగా క్షమాపణ చెప్పారని, బాధ్యతను అధికారులపై మాత్రమే మోపే ప్రయత్నాన్ని బీజేపీ అంగీకరించదని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇస్తేనే తమ ఆందోళన విరమిస్తామని తెలిపారు. సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం ఇతర అంశాలను ప్రస్తావిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా? జరిగితే ఆ నివేదికను పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. సంబంధిత నివేదికలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!