
క్రీడలు

రూ.29,560 కోట్ల వ్యయంతో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వర్షపు నీటితో మునిగిన దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఏడాది మార్చి 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విమానాశ్రయంలో స్వల్ప వర్షానికే నీరు చేరినట్లు సమాచారం. విమానాశ్రయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
భారీ వ్యయంతో నిర్మించిన విమానాశ్రయంలో వర్షపు నీటి నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ పనితీరు, నీటి నిల్వకు కారణాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే నీరు చేరిన ప్రాంతాలు, నష్టం లేదా విమాన కార్యకలాపాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!