

హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో శబ్ద కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుతోంది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) నిర్వహిస్తున్న రియల్టైమ్ నాయిస్ మానిటరింగ్ కేంద్రాల గణాంకాల ప్రకారం, జనవరి నుంచి మే వరకు అనేక ప్రాంతాల్లో అనుమతించిన పరిమితులను మించి ధ్వని కాలుష్యం నమోదైంది. ముఖ్యంగా జూపార్క్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) వంటి సున్నిత ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది.
జూబ్లీహిల్స్, తార్నాక, జేఎన్టీయూ, హెచ్సీయూ, జూపార్క్ ప్రాంతాల్లో సగటున 15 నుంచి 25 డెసిబెల్స్ వరకు అధిక శబ్దం నమోదవుతోంది. హెచ్సీయూలో పగటి వేళ 67-71 డెసిబెల్స్, రాత్రి 66-69 డెసిబెల్స్ వరకు నమోదు కావడం గమనార్హం. పెరుగుతున్న ట్రాఫిక్, భారీ నిర్మాణ పనులు, వేగవంతమైన నగరీకరణ, అధిక హారన్ వినియోగం, రాత్రివేళల వాణిజ్య కార్యకలాపాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలికంగా ఇది ప్రజారోగ్యంతో పాటు వన్యప్రాణులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!