
జనరల్

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ రీటెస్ట్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా నకిలీదని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నీట్ రీటెస్ట్ విజయవంతంగా నిర్వహించామని ఎన్టీఏ వెల్లడించింది. విద్యార్థుల్లో ఆందోళన సృష్టించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇదే సమయంలో బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారనే ఆరోపణలు రాజకీయ వివాదానికి దారితీశాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!