
రాజకీయాలు

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి వాటాలను తక్షణమే ఖరారు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్కు లేఖ రాసింది. ఆగస్టు 6, 2026న పంపిన ఈ లేఖలో, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రస్తుతం ఉన్న నీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటాలను స్పష్టంగా నిర్ణయించాలని కోరింది.
ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలో, నీటి కేటాయింపుల అంశంపై మాత్రమే చర్చించేలా సింగిల్ పాయింట్ అజెండాతో కేఆర్ఎంబీ లేదా త్రిసభ్య కమిటీ సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అందుబాటులో ఉన్న నీటిని రెండు రాష్ట్రాలు జాగ్రత్తగా వినియోగించేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!