
జనరల్

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలను పార్టీ అధిష్టానం అత్యవసరంగా ఢిల్లీకి పిలిచింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్న పార్టీ ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముందు రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పాటిల్ నితిన్ నబీన్ను కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై నివేదిక అందజేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, నేతల మధ్య సమన్వయం, పార్టీ హైకమాండ్ ఆదేశాల అమలు వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!