

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అమరావతిలోని వీఐటీ విద్యార్థులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 10 వేల మంది విద్యార్థులు పోస్టుకార్డులపై మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు రాశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రేమతో రాసిన చిన్న పోస్టుకార్డు కూడా ఒక వ్యక్తికి ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతాల సురేష్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ పాతూరు నాగభూషణం, వీఐటీ అమరావతి ఉపకులపతి పి. అరుల్మొళివర్మన్, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర ముదిగంటి తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!