

ప్రతి పరిపాలనా నిర్ణయంలో ప్రజల సంక్షేమమే కేంద్రబిందువుగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువ ఐఏఎస్ అధికారులకు సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖల్లో సహాయ కార్యదర్శులుగా నియమితులైన 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి దస్త్రం వెనుక లక్షలాది మంది ప్రజల ఆశలు, ఆందోళనలు, జీవితాలు ఉంటాయని గుర్తుంచుకోవాలని సూచించారు. 2047 నాటికి వికసిత భారత లక్ష్య సాధనలో విధానాలు, పరిపాలనా నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
డేటాను కేవలం గణాంకాలుగా కాకుండా ప్రజల సమస్యలు, అవసరాలు, ఆకాంక్షలను ప్రతిబింబించే సాధనంగా చూడాలని మోదీ సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతోందో నిరంతరం సమీక్షించాలన్నారు. మరోవైపు బ్రిక్స్ దేశాల మధ్య ఉగ్రవాదం, సైబర్ నేరాలపై సమన్వయం పెరగాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. హర్మూజ్ జలసంధి పునఃప్రారంభం ప్రపంచ ఇంధన భద్రతకు శుభపరిణామమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పేర్కొనగా, పరస్పర ప్రయోజనాలను భారత్-చైనా గౌరవించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!