

హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న 245 మంది ఎయిర్ ఫోర్స్ కెడెట్లకు ఆయన అభినందనలు తెలిపారు. 1947-48, 1971 యుద్ధాల్లో దేశ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గొప్ప వారసత్వం కలిగిన భారత వాయుసేనలో మీరు అడుగుపెడుతున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం యుద్ధ విధానం వేగంగా మారుతోందని, సంప్రదాయ సైనిక బలంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. వాయుసేనలో ఇన్నోవేషన్, ఎగ్జిక్యూషన్, అప్రమత్తత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత వాయుసేన ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని కెడెట్లకు సూచించారు. రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్లు, ఆధునిక యుద్ధ పరికరాల వినియోగంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతోందని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!