15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

Writer: Chandrika 09:22 AM, 15 సెప్టెంబర్, 2026
హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ చమురు సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇరాన్‌, అమెరికా మధ్య ఘర్షణలతో పాటు హూతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్న వేళ.. సౌదీ అరేబియాకు కీలకమైన ఈస్ట్‌-వెస్ట్‌ ఆయిల్‌ పైప్‌లైన్‌ కూడా దెబ్బతింది. దీంతో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చినట్లు సమాచారం. తూర్పు సౌదీలోని అబ్‌కైక్‌ చమురు శుద్ధి కేంద్రం నుంచి ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు పోర్టు వరకు సుమారు 1,200 కిలోమీటర్ల మేర ఈ పైప్‌లైన్‌ విస్తరించింది. యాన్బు నుంచి బాబ్‌ ఎల్‌ మాండెబ్‌, సూయజ్‌ కెనాల్‌ మార్గాల ద్వారా ఆసియా, ఐరోపా దేశాలకు చమురు సరఫరా చేయవచ్చు. హర్మూజ్‌ జలసంధిలో అంతరాయాలు ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గంగా ఉపయోగించేందుకు ఈ పైప్‌లైన్‌ను నిర్మించారు. అయితే డ్రోన్‌ దాడుల నేపథ్యంలో ఇది కూడా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి జరిగినట్లు సౌదీ అధికారులు వెల్లడించగా.. పంపింగ్‌ స్టేషన్ల వద్ద మంటలు కనిపించినట్లు అమెరికా అధికారులు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పైప్‌లైన్‌ తిరిగి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు.

ఈస్ట్‌-వెస్ట్‌ ఆయిల్‌ పైప్‌లైన్‌ రోజుకు గరిష్ఠంగా 70 లక్షల బ్యారెళ్ల చమురును రవాణా చేయగలదు. ఇందులో సుమారు 50 లక్షల బ్యారెళ్లను ఎగుమతుల కోసం, మిగతా మొత్తాన్ని సౌదీలోని రిఫైనరీలకు తరలించేందుకు వినియోగిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఇది పూర్తి సామర్థ్యంతో పనిచేయకుండా రోజుకు 40-50 లక్షల బ్యారెళ్ల చమురును మాత్రమే రవాణా చేస్తోంది. అయినప్పటికీ ఈ పరిమాణం ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 4-5 శాతానికి సమానం. దీంతో ఈ మార్గంలో ఏర్పడిన అంతరాయం ప్రపంచ చమురు మార్కెట్‌లో అనిశ్చితిని మరింత పెంచే అవకాశం ఉంది. భారత్‌పైనా దీని ప్రభావం పడొచ్చు. మన దేశ చమురు దిగుమతుల్లో సౌదీ అరేబియా వాటా సుమారు 7-8 శాతంగా ఉంది. ఆగస్టులో భారత్‌ 3.32 లక్షల బ్యారెళ్ల సౌదీ చమురును దిగుమతి చేసుకోగా.. జులైలో 4.14 లక్షల బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది. భారత్‌ పలు దేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నందున తక్షణ కొరత పెద్దగా ఉండకపోయినా.. ప్రత్యామ్నాయ చమురు సరఫరాల ధరలు పెరిగితే దిగుమతి వ్యయం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. PPAC గణాంకాల ప్రకారం ఏప్రిల్‌-జులై కాలంలో భారత్‌ ముడిచమురు దిగుమతి బిల్లు ఏడాది క్రితంతో పోలిస్తే 56 శాతానికి పైగా పెరిగి 63.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2025-26లో ముడిచమురు దిగుమతుల వ్యయం సుమారు 135 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల వద్ద కొనసాగి, దిగుమతి పరిమాణం తగ్గకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం 200 బిలియన్‌ డాలర్లను దాటే అవకాశం ఉంది. ధరలు మరింత పెరిగితే భారత్‌ వాణిజ్య, కరెంట్‌ ఖాతా లోటుపై ఒత్తిడి మరింత తీవ్రం కావచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెటాతో కేంద్రం చర్చలు.. చిన్నారుల లైంగిక వేధింపుల కేసులను పోలీసులకు నివేదించేందుకు అంగీకారం

మెటాతో కేంద్రం చర్చలు.. చిన్నారుల లైంగిక వేధింపుల కేసులను పోలీసులకు నివేదించేందుకు అంగీకారం

లైంగిక దాడి కేసులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

లైంగిక దాడి కేసులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్  కీలక భేటీ..

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ..

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

ట్యాగ్లు
సౌదీ అరేబియాసౌదీ ఆయిల్ పైప్‌లైన్ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్హూతీ దాడులుపశ్చిమాసియా ఘర్షణలుచమురు ధరలుముడిచమురుభారత్ చమురు దిగుమతులుహర్మూజ్ జలసంధియాన్బు పోర్టుసౌదీ చమురుభారత ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెటాతో కేంద్రం చర్చలు.. చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కీలక నిర్ణయం
జనరల్

మెటాతో కేంద్రం చర్చలు.. చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కీలక నిర్ణయం

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...
బిజినెస్

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు
జనరల్

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..
బిజినెస్

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...
క్రీడలు

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్  కీలక భేటీ..
జనరల్

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
జనరల్

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు
జనరల్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!