
షోస్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులతో హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా 22/A భూముల అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలో ఉంచిన భూముల వివరాలను సీఎం మంత్రులకు వివరించనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను కూడా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!