

భారతదేశం గర్వించదగిన తొలితరం ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దేశంలోని ఇంజనీర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం, దూరదృష్టితో విశ్వేశ్వరయ్య దేశ అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
విశ్వేశ్వరయ్య చూపిన బాటలో నేటి ఇంజనీర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా సంక్షేమంతో మేళవిస్తూ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని సీఎం అన్నారు. భవనాలు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగం నుంచి ఆధునిక సాంకేతికత వరకు ప్రతి రంగంలో ఇంజనీర్ల కృషి దేశ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తోందని తెలిపారు. విశ్వేశ్వరయ్య ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని బలమైన మౌలిక వసతులు, అభివృద్ధి చెందిన సమాజం, ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఇంజనీర్లు మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!