

అమెరికాలోని సియాటెల్ నగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రముఖ స్పేస్ నీడిల్ సమీపంలోని సియాటెల్ సెంటర్లో నిర్వహిస్తున్న ‘బైట్ ఆఫ్ సియాటెల్’ ఫుడ్ ఫెస్టివల్లో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, రెండేళ్ల బాలుడు సహా మరో ఐదుగురు గాయపడ్డారు. కాల్పులతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొనగా, సందర్శకులు, వ్యాపారులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. క్షతగాత్రులను హార్బర్వ్యూ మెడికల్ సెంటర్కు తరలించారు.
ఘటన జరిగిన సమయంలో ఫుడ్ ఫెస్టివల్ సందర్శకులతో రద్దీగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పలుమార్లు తుపాకీ పేలిన శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారని తెలిపారు. కాల్పులకు పాల్పడింది ఎవరు, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడా అనే వివరాలను అధికారులు వెంటనే వెల్లడించలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ‘బైట్ ఆఫ్ సియాటెల్’ నగరంలో ఏటా నిర్వహించే ప్రముఖ ఫుడ్ అండ్ కమ్యూనిటీ ఫెస్టివల్.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!