
రాజకీయాలు

అమెరికా, ఇరాన్ల మధ్య ఇటీవల ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చల నేపథ్యంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు చూపించుకోవడానికి ప్రయత్నిస్తోందని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ (రిటైర్డ్) ఎం.ఎం నరవణె వ్యాఖ్యానించారు. పాక్ నిజానికి మధ్యవర్తి కాదని, కేవలం సందేశాలు చేరవేసే “కొరియర్” పాత్రలో మాత్రమే ఉందని ఆయన విమర్శించారు.
కోల్కతాలో మీడియాతో మాట్లాడిన నరవణె, జాతీయ భద్రత మరియు ఆర్థిక భద్రత ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయని తెలిపారు. ప్రపంచ సంక్షోభాల ప్రభావం తప్పదని, భారత్ స్వయం సమృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశీయ ఉత్పత్తులు, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ ఒడుదొడుకులను ఎదుర్కోవచ్చని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!