
షోస్

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యార్థులపై నమోదైన కేసులను కొట్టివేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత అమలు చేయకుండా కేంద్రం విశ్వాసఘాతుకానికి పాల్పడిందని విమర్శించింది. అలాగే నీట్ పరీక్షకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు, వారి కుటుంబాలకు పరిహారం అందించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించింది.
ఈ అంశాలపై చర్చించేందుకు సీజేపీ నేడు (ఆగస్టు 24) కీలక సమావేశం నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, విద్యార్థుల సమస్యలు, నీట్ బాధిత కుటుంబాలకు న్యాయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అనంతరం పార్టీ తదుపరి కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించనున్నట్లు సీజేపీ వర్గాలు తెలిపాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!