
జనరల్

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో అంబటి రాంబాబు అవమానకరమైన పోస్టులు చేశారని ఆరోపిస్తూ టీడీపీ నేత చిగురుపాటి సూర్య నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తన ఫిర్యాదులో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని సూర్య నారాయణ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!