
ఆరోగ్యం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో దారుణ హత్య చోటుచేసుకుంది. ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన గంగరాజు తన భార్య సునీత (32)ను గొంతు కోసి హత్య చేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం, దంపతుల మధ్య జరిగిన గొడవలో ఆమెను తీవ్రంగా కొట్టడంతో గాయపడిన సునీతను కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్దామని నమ్మబలికి మహిళా వార్డు నుంచి బయటకు తీసుకువచ్చి, తన వద్ద ఉన్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!